మహిష్మతి అనె ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక పల్లెటూరు. ఆ ఊరికి మొనగాడు శివుడు. నిజానికి అతడో రాకుమారుడు. అతని అసలు పేరు వీరేంద్ర బాహుబలి. అతని తండ్రి పేరు అమరేంద్ర బాహుబలి. సొంత తమ్ముడే రాజ్యం కోసం అమరేంద్ర కుటుంబాన్ని చంపిస్తాడు. వీరేంద్ర మాత్రం బతుకుతాడు. ప్రవాహంలో కొట్టుకుపోతున్న అతడిని పల్లె వాసులు రక్షిస్తారు. ఈ నిజం తెలుసుకున్న శివుడు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. తన రాజ్యాన్ని పాలిస్తున్న చిన్నాన్న బిజ్జల దేవ కొడుకు బళ్ళాల దేవ కొలువులో చేరి, అతని నమ్మకాన్ని చూరగొంటాడు. రహస్యంగా సైన్యాన్ని సమీకరించుకుంటాడు. తమ్ముడిపై యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఎత్తులకు పై ఎత్తులు వేసి రాజ్యాన్ని దక్కించుకుంటాడు.
అదీ కథ.....
No comments:
Post a Comment